41 కిలోమీటర్లు కాలినడకన.. తుల్జా భవాని గుడికి వినయ్ రెడ్డి

by Sathputhe Rajesh |

41 కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్లి వినయ్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు.

41 కిలోమీటర్లు కాలినడకన.. తుల్జా భవాని గుడికి వినయ్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గల రూప భవాని అమ్మవారి ఆలయన్ని కాలినడకన వెళ్లి వినయ్ రెడ్డి దర్శించుకున్నారు. తుల్జా భవాని అమ్మవారి ఆలయం వరకు 41 కిలోమీటర్ల మేర నడిచి వినయ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేసి ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది చేసిన తరహాలోనే 18వసారి సైతం 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేసేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు సోమవారం చెప్పారు.

Next Story