- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
44 లక్షల మంది ఖాతాలో 3487 కోట్ల రైతు భరోసా నిధులు జమ
రాష్ట్రంలో వ్యవసాయ సాగు యోగ్యమైన మూడు ఎకరాల వరకు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు బుధవారం జమ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ సాగు యోగ్యమైన మూడు ఎకరాల వరకు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు బుధవారం జమ చేశారు. బుధవారం ఒక్క రోజే రూ.1230కోట్లను రైతు ఖతాలో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 44,82,265 మంది రైతులకు 58,13,036 ఎకరాల భూమికి రైతు భరోసాను రూ.3487 కోట్లను అందించినట్లుగా వ్యవసాయ శాఖ తెలిపింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు జనవరి 27 నుంచి రైతు భరోసా నిధుల జమ మొదలు కావడం మొదలైంది. ఇప్పటి వరకు విడతల వారిగా నిధులను జమ చేశారు. యాసంగి పంటకు రైతులకు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎకరానికి రెండు పంటలకు రూ.12వేలు ఇస్తుంది. దీని లో భాగంగా యాసంగిలో ఎకరానికి రూ.6వేలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకే సగానికి పైగా రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. త్వరలోనే మిగిలిన రైతులకు నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
Next Story






