తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు.. కేంద్ర మంత్రి జయంతిభాయ్ బాంభానియా ప్రకటన

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా భారీగా రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ పకడ్బందీగా ముగిసినట్లుగా కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు.

తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు.. కేంద్ర మంత్రి జయంతిభాయ్ బాంభానియా ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా అక్రమంగా ఉన్న రేషన్​కార్డులను తొలగించినట్లు పార్లమెంటులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 5.51 లక్షల రేషన్​దుకాణాలో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీని సులభతరం చేసేందుకు ఆపాస్​పరికరాలను అమర్చడం జరిగిందని తెలిపారు. దీంతో రేషన్​సరకుల పంపిణీ అక్రమాలకు చోటు లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం, ప్రజా పంపిణీ వ్యవస్థ డేటాబేస్‌ను ఇతర సంక్షేమ పథకాలతో లింక్​చేయడానికి ఎటువంటి ప్రతిపాదన లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 41.41 లక్షల కార్డులను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఇందులో ఆదాయపు పన్ను శాఖ , రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ , కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జీఎస్టీ డేటా ఆధారంగా అక్రమ కార్డులకు కత్తెర పెట్టినట్లు వెల్లడించారు. అతి తక్కువగా ఆంద్రప్రదేశ్​లో 102 కార్డులు కాగా, అత్యదికంగా రాజస్దాన్​లో 6 లక్షలకు పైగా కార్డులు తొలగించారు.

తెలంగాణలో పెరిగిన రేషన్​కార్డుల సంఖ్య..

రాష్ట్రంలో గత బీఆర్​ఎస్​ప్రభుత్వంలో ఉన్న కార్డుల కంటే రేవంత్​ప్రభుత్వంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్​కార్డులు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17,348 రేషన్​దుకాణాలు ఉండగా వాటి ద్వారా నెలకు 1.05 కోట్ల కార్డులకు రేషన్​పంపిణీ జరుగుతుంది. అందులో ఫుడ్​సెక్యూరిటీ కార్డులు 99,36,073 ఉండగా, అంత్యోదయ అన్న యోజన కార్డులు5,66,660, అన్నపూర్ణ కార్డులు 5146 ఉన్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలో అత్యదిక కార్డులు గ్రేటర్​మూడు జిల్లాల్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్​లో 936 రేషన్​దుకాణాలుంటే కార్డులు 8.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 588 షాపులు ఉండగా 6.53 లక్షలు, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలో 655 రేషన్​దుకాణాలు ఉంటే 6.41 లక్షల కార్డులు ఉన్నాయి. తక్కువ కార్డులు ములుగు జిల్లాలో 1.02 లక్షలు, నారాయణపేట జిల్లాలో 1.69 లక్షలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Next Story