- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
12 ఎకరాల ధాన్యం భగీరథ పాలు..
by Disha Web Desk 4 |
X
దిశ, ఖానాపూర్: ఆరుగాలం కష్టపడి రైతులు కుప్ప చేసిన ధాన్యం రాశిని మిషన్ భగీరథ తన్నుకుపోయింది. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి ధాన్యం కొట్టుకుపోయిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని కింది బస్టాండ్ సెంటర్లో ఇండ్ల ముందు ఆరబోసిన వరి ధాన్యం మిషన్ భగీరథ నీటిలో కొట్టుకుపోయింది. సుమారు 12 ఎకరాల వడ్లు కొట్టుకుపోయినట్టు రైతులు చెబుతున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో రోడ్డుపై గురువారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. కాగా రైతులకి జరిగిన నష్టం ప్రభుత్వం పరిహారం ఇస్తుందా దీనిలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఉందా, కాకతాళీయంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Next Story