అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: మరో 10 స్పెషల్ రైళ్లు

by Muthe.Rajitha |

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: మరో 10 స్పెషల్ రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 60 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి 31 మధ్య ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండటంతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు నడవనున్నాయి. అలాగే రేపటి నుంచే ఈ సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే వీటిలో సిర్పూర్ కాగజ్ నగర్ - కొల్లం జంక్షన్ (రైలు నం. 07117), చర్లపల్లి - కొల్లం జంక్షన్ (07119), చర్లపల్లి - కొల్లం జంక్షన్ (07121), హుజుర్ సాహిబ్ నాందేడ్ - కొల్లం (07123) రైళ్లకు మొదటగా టికెట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Next Story