సంక్రాంతికి ఆర్టీసీ బస్సులపై నిర్ణయం

by  |
సంక్రాంతికి ఆర్టీసీ బస్సులపై నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి నడిపే బస్సు సర్వీసులపై తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్​కు అవకాశం కల్పించారు.



Next Story

Most Viewed