రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

by  |
Minister Jagadish Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎటువంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది దేవుడు వినాయకుడి పూజలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతోందని, ఇది యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed