- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
దుబాయ్లో తెలంగాణ వాసికి బంపర్ బహుమతి లభించింది. దుబాయ్ లక్కీ డ్రాలో రూ.7.3 కోట్లను తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గల్ప్ న్యూస్ గురువారం వెల్లడించింది .వివరాల్లో కెళితే…ఏడాది క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ కు గ్రంధి లక్ష్మీ వెంకట తాతారావు వెళ్లారు. అయితే దుబాయ్ లో 1999 నుంచి మిలీనియం మిలియనీర్ పేరిట లక్కీడ్రాను నిర్వహిస్తున్నారు. కాగా ఆ లాటరీ టికెట్టుును తాతారావు కొన్నారు. తాజాగా నిర్వహించిన లక్కీ డ్రాలో ఆయనకు మొదటి బహుమతి వచ్చింది. బహుమతి కింద ఆయనకు నిర్వాహకులు రూ.7.3కోట్లు ఇవ్వనున్నారు. దీనిపై తాతారావు మాట్లాడుతూ….బతుకు తెరువు కోసం వచ్చిన తనకు ఈ దేశం కావాల్సినంత డబ్బు ఇచ్చిందని అన్నారు. ఈ డబ్బుతో ప్రశాంతంగా బతుకుతానని ఆయన తెలిపారు.
Next Story