కారణం లేకుండా బయటకు వస్తే చర్యలు..

by Shyam |

<p>తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను ఎవరు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా బయటకు వస్తే వారికి భారీగా ఫైన్‌లు విధిస్తామన్నారు. ఇప్పటికే అకాడమిక్ పరీక్షలను రద్దు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ముందుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, ఇవ్వకుండా బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇతర రాష్ట్రాల [&hellip;]</p>

కారణం లేకుండా బయటకు వస్తే చర్యలు..
X

తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను ఎవరు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా బయటకు వస్తే వారికి భారీగా ఫైన్‌లు విధిస్తామన్నారు. ఇప్పటికే అకాడమిక్ పరీక్షలను రద్దు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ముందుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, ఇవ్వకుండా బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దులను ముందుగానే మూసివేశామన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, సమస్య తీవ్రంగా ఉంది కావునే లాక్‌డౌన్ ప్రకటించినట్టు వివరించారు. దయచేసి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని సీఎస్ కోరారు.

Tags: ts cs somesh kumar, carrona serious stage, dont come out side

Next Story