సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

by  |
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాస్పత్రులలో పని చేసే వైద్యులకు యూజీసీ వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల తెలంగాణ మెడికల్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుట్లా శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ నరహరి తదితరులు కోఠిలోని కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోధనాస్పత్రుల వైద్యులకు యూజీసీ వేతనాలే కాకుండా వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు 10 శాతం ఇంటెన్సివ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed