- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: దుబాయ్లో కరోనా సోకి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితి లేక అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో చివరి చూపునూ నోచుకోలేని ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. మోహన్రావు పేటకు చెందిన మునిగంటి మల్లేశం అలియాస్ రాజం(48) దుబాయ్లోని జెబలాలిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సాధారణ వర్కర్గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 27న ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. అనంతరం మృతదేహానికి పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. మల్లేశం మృతదేహాన్ని స్వదేశానికి పంపే వీలులేక అక్కడే దహన సంస్కారాలు చేశారు. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఈటీసీఏ) ఆధ్వర్యంలో మల్లేశం అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. కాగా, మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈటీసీఏ వ్యవస్థాపకుడు పీచర కిరణ్ కుమార్, అధ్యక్ష్యుడు రాధారపు సత్యంలు విజ్ఞప్తి చేశారు.
Tags:corona, dubai, migrate worker, dead, korutla, ts news