కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ జవాన్ మృతి

by  |
కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ జవాన్ మృతి
X

దిశ, బాల్కొండ: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా వాస్తవాదీన రేఖ వద్ద భారత జవాన్లకు, ఉగ్రవాదులను మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన జవాన్ వీరమరణం పొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమనపల్లికి చెందిన ర్యాడ మహేశ్ మృతిచెందారు. కాగా జవాన్ మహేశ్ గతేడాది ప్రేమ వివాహం చేసుకుని, ఎనిమిది నెలల కిందనే ఆర్మీలో చేరినట్టు సమాచారం. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొత్తం నలుగురు జవాన్లు వీర మరణం చెందగా, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో ఉగ్రవాదుల కుట్రను భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. దేశం మీద ప్రేమతో చిన్నవయస్సులో సైన్యంలో చేరిన మహేశ్ మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబంతో పాటు, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed