అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. వారికి బెయిల్ మంజూరు

by  |
agrigold
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ కేసులో అగ్రిగోల్డ్‌ నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో అగ్రిగోల్డ్‌ నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అవ్వా వెంకటరామారావు, అవ్వా వెంకటశేషు నారాయణరావు, అవ్వా హేమసుందర వరప్రసాద్‌లకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వడ్డీ ఆశచూపి వసూలు చేసిన డిపాజిట్లను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 32,02,628 మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు విచారణలో గుర్తించిన సంగతి తెలిసిందే.


Next Story