కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక..

by  |
కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా టెస్టులు తక్కువ చేసి చూపించడంపై మండిపడింది. తెలంగాణ ఏజీ సమర్పించిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, 48 గంటల సమయం ఇస్తున్నామని తెలిపింది. ఈ సమయంలోగా కర్ఫ్యూ, లాక్ డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. కరోనా నియంత్రణకు మీరు చర్యలు తీసుకోని యెడల తాము తదుపరి ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయమూర్తి స్పష్టంచేశారు.

Next Story

Most Viewed