వారికి తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఎందుకంటే ?

by  |
వారికి  తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా, గోదావరి రివర్ బోర్డు చైర్మన్లకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ రోజు జరగబోయే బోర్డు సంయుక్త సమావేశాన్ని వాయిదా వేయాలంటూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. కోర్టుల్లో కేసులు విచారణ ఉన్నందున భేటీకి హాజరు కాలేమని, రెండు బోర్డులకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ లేఖ ద్వారా తెలిపారు. సమావేశానికి అనువైన తేదీని నిర్ణయించి తెలపాలని ఆయన లేఖ ద్వారా బోర్డు చైర్మన్లను కోరారు. కాగా, ఇప్పటికే సమావేశాన్ని వాయిదా వేయాలని ఈఎన్‌సీ లేఖల ద్వారా తెలిపింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ సీఎస్ లేఖలు రాసింది. అంతే కాకుండా ఈ నెల 3న జరిగిన సమావేశానికి తెలంగాణ గైర్హాజరయ్యింది. దీంతో ఏపీ సభ్యలు అప్పటి సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed