అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

by  |
అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
X

దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. మండలి ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహ చార్యులు, శాసనసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు ముందు శాసనసభ ప్రాంగణంలోని డా. బి ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు సభాపతి పోచారం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలు వేసి నివాళులర్పించారు.

Next Story

Most Viewed