రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు

by  |
రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర అవరతణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్‌పార్క్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగర సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య తదితర విభాగాల అధికారులతో కలిసి గన్‌పార్క్ వద్ద చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా పలువురు అధికార, అనధికార ప్రతినిధులు, పార్టీల నాయకులు గన్‌పార్క్ వద్దకు నివాళులు అర్పించేందుకు వచ్చే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.



Next Story

Most Viewed