బీకేయూ రాకేశ్ టికాయత్‌‌కు తెలంగాణ రైతు నాయకుల మద్దతు..

by  |
బీకేయూ రాకేశ్ టికాయత్‌‌కు తెలంగాణ రైతు నాయకుల మద్దతు..
X

దిశ, ఆర్మూర్ : మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులు బేషరతుగా ఉప సంహరించాలని.. బీకేయూ ఆధ్యర్యంలో గత 9 నెలలుగా చేస్తున్న ఆందోళనకు తెలంగాణ రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.

శుక్రవారం ఢిల్లీ సరిహద్దు గాజీపూర్ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్‌ను కలిసి తెలంగాణ రైతుల తరఫున మద్దతు తెలిపారు. మద్దతు ప్రకటించిన వారిలో తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు(ఖమ్మం), టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేశ్ గౌడ్ ఉన్నారు.



Next Story