భూ వివాదంలో ఏసీపీ, ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

by  |
భూ వివాదంలో ఏసీపీ, ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ శాఖలో ఔటర్ రింగ్ రోడ్డు భూ వివాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంలో చిక్కుకున్న ఏసీపీతో పాటు ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో వనస్థలిపురం ఏసీపీ జయరాంరెడ్డిని, ఎస్‌ఆర్ నగర్ ఇన్స్‌పెక్టర్ మురళి కృష్ణను సస్పెండ్ చేసినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ భూ వివాదాల్లో జయరామ్, మురళి కృష్ణలు తల దూర్చినట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఔటర్ భూములపై బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేశ్ భగవత్‌కు అనేక ఫిర్యాదులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై ఓ ప్రత్యేక అధికారిని నియమించి, ఏసీపీ, ఇన్స్‌పెక్టర్‌ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed