రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు

by  |
రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76 జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమ్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారత దేశ ప్రజలందరూ రాజీవ్ గాంధీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఆయన దేశానికి చాలా సేవ చేశారని చెప్పారు.

Next Story