డీజీపీని కలిసిన కాంగ్రెస్ బృందం

by  |
డీజీపీని కలిసిన కాంగ్రెస్ బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీని కలిసిన టీపీసీసీ ఉత్తమ్ బృందం.. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇతర పార్టీలో చేరినట్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పై టీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర అని ధ్వజమెత్తారు. శ్రీనివాస్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.



Next Story