- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సాయం కోరారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయక చర్యల కోసం స్పీడ్ బోట్స్ పంపించాలని సోమవారం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ రిక్వెస్ట్కు వెంటనే స్పందించిన జగన్.. తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది.
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పటికే అతలాకుతలం కాగా ఇప్పటికే అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వరద ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో స్పీడ్ బోట్లను పంపించాలని ఏపీ సీఎం సాయం కోరారు.
Next Story