- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను, మెరుగైన సౌకర్యాలను, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నియమించిన వైద్యారోగ్యశాఖ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా నియమించారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని వైద్య సేవలను అధ్యయనం చేయాల్సిందిగా క్యాబినెట్ ఆదేశించింది. వీటితో పాటు పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని క్యాబినెట్ సూచించింది.
Next Story