రూ.3వేల కోట్లు కేటాయించాలని ప్రధానికి లేఖ

by  |
రూ.3వేల కోట్లు కేటాయించాలని ప్రధానికి లేఖ
X

దిశ, హైదరాబాద్: దేశవ్యాప్తంగా న్యాయవాదుల సంక్షేమానికి రూ.3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పథకంలో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ఆయన స్వాగతించారు. దేశ వ్యాప్తంగా 28రాష్ట్రాలలో 13లక్షల పైగా న్యాయవాదులు ఉన్నారని, అదనంగా స్టెనోలు, టైపిస్టులు, స్టాంప్ప్ వెండర్స్, గుమస్తాలు మొత్తం 20 లక్షలు ఉన్నారన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ నియంత్రణలో న్యాయవాదులు, న్యాయవాదులపై ఆధారపడుతున్న వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed