‘చిత్రం’కు సీక్వెల్.. ఉదయ్ కిరణ్ ప్లేస్ ఎవరిది?

by  |
Chitram
X

దిశ, సినిమా: దర్శకుడు తేజ హ్యాపీయెస్ట్ న్యూస్ షేర్ చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా సూపర్ హిట్ ఫిల్మ్ ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ ప్రకటించాడు. 2000 సంవత్సరంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌‌గా రిలీజైన ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ.. ఈ చిత్రం ద్వారానే ఉదయ్ కిరణ్, రీమాసేన్‌తో పాటు 45 మంది కొత్త యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఆర్‌పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ యువతను ఉర్రూతలూగించగా, సాంగ్స్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. కాగా ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీతో తేజ అండ్ ఆర్పీ పట్నాయక్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. ఎస్ స్టూడియోస్‌తో కలిసి తేజ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వర రావు పనిచేయనున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా.. మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed