ప్రభుత్వ భూమి కబ్జా.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తహసీల్దార్

by  |
ప్రభుత్వ భూమి కబ్జా.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తహసీల్దార్
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అన్నంపెళ్లి గ్రామంలో ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని పినపాక మండల తహసీల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు. అన్నంపెళ్లి గ్రామంలోని సర్వే నెం. X/81 రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని కొంత మంది కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి అమ్మాలని చూస్తున్నారని ఆయన తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు సర్వే నెం.ఎక్స్ బై 81 ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకొని ఫెన్సింగ్ వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గానీ, ప్రభుత్వ భూములను గానీ దుర్వినియోగం చేస్తే ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదన్నారు. భూకబ్జాలు, వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని అట్టి వారిని వదిలిపెట్టే సమస్యే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేయడం, ప్రభుత్వ భూములను కాపాడటమే నా లక్ష్యమన్నారు. అనంతరం అన్నంపెళ్లి గ్రామంలోని సర్వే నెం.ఎక్స్ బై 81లో ఉన్న ప్రభుత్వ భూమిలో రెవిన్యూ సిబ్బందితో కలిసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడిన తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ను పలువురు నాయకులు, గ్రామస్తులు అభినందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed