చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతా

by  |
చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకనవుతా
X

దిశ, తుంగతుర్తి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే చట్టసభల్లో ప్రజాలపక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానని తీన్మార్ మల్లన్న అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పాదయాత్రలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. పాతాలపోశెట్టి చేసిన కుట్రలను చట్టసభల్లో ఎండగట్టాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రత్యక్షమైనానే తప్ప.. పదవులను ఆశించి కాదన్నారు. నేను మరణించే సమయంలో నా వంటి మీద బట్టలు తప్ప వేరే ఆస్తులేమి నాకు ఉండవని, నేను ప్రజాలపక్షాన పోరాడే గొంతుకనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దింపే వరకు తన ఉద్యమం ఆగదని అన్నారు.

Next Story