బిగ్ బ్రేకింగ్.. బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

by  |
బిగ్ బ్రేకింగ్.. బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. కాషాయ తీర్థం పుచ్చుకుంటానని తీన్మార్ మల్లన్న గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేసి మంగళవారం ఢిల్లీలో పార్టీ పెద్దల చేతుల మీదుగా కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మల్లన్నను బీజేపీలో చేర్చుకునేందుకు ఎంపీ అరవింద్ పలుమార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో మల్లన్న పార్టీలో చేరారు. ఎంపీ బండి సంజయ్, అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed