టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు

by  |
Mallanna
X

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై స్పందిస్తూ.. షకీల్, ఆయన అనుచరుల నుంచి ప్రాణాపాయం ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మీడియా ముందే తనను మూడు ముక్కలుగా నరుకుతా అన్న షకీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed