- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జల్పల్లి: భూమికి జానెడు లేడు కానీ, మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతాడా..? అతనేదో అధికారంలోకి వస్తున్నట్టు అంటూ తీగల కృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. అసలు కేసీఆర్ను ఓడించే దమ్ము.. దేశంలో ఎవరికి లేదని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బడంగ్పేట్లో జరిగిన మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్కార్యకర్తల ముఖ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్ అని మా ముఖ్యమంత్రి ముందు ఎవరి పప్పులు ఉడకవని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి వచ్చే నాయకులను చూసి మాట్లాడేటోళ్లు బీజేపీ నాయకులని విమర్శించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ.. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్న బీజేపీకి హుజూరాబాద్లో ఓటమి తప్పదన్నారు. అమ్మకానికి మారు పేరు అయిన బీజేపీకి తగిన బుద్ధి చెబుతూ.. నమ్మకానికి మారుపేరు అయిన తెలంగాణ రాష్ట్రానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.