- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో రూ. 999 ధరలో Ptron ఇయర్బడ్స్
దిశ, వెబ్డెస్క్: దేశీయ కంపెనీ Ptron కొత్తగా భారత మార్కెట్లో 'Bassbuds Zen' వైర్లెస్ (TWS) ఇయర్బడ్లను లాంచ్ చేసింది. దీని ధర రూ. 999. ఈ కామర్స్ సైట్ అమెజాన్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపులు కూడా పొందుతారు. ఇవి బ్లాక్, బ్లూ కలర్స్లలో లభిస్తాయి. Ptron Bassbuds Zen ఇయర్ బడ్స్ 30dB వరకు బయట సౌండ్స్ను తగ్గించే టెక్నాలజీతో వస్తుంది. ENC, TruTalk సాంకేతికతతో కూడిన క్వాడ్ మైక్రోఫోన్లను అమర్చారు.
అలాగే చార్జింగ్ కేస్లో 400mAh బ్యాటరీ ఉంటుంది. అదనంగా ఇయర్బడ్లలో 40mAh సెల్లను అందించారు. ఇది గరిష్టంగా 50 గంటల ప్లేబ్యాక్ టైమ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. చార్జింగ్ కేసు USB టైప్-C ని కలిగి ఉంది. ఇయర్బడ్లను పూర్తిగా చార్జ్ చేయడానికి ఒక గంట సమయం పడుతుంది. అలాగే ఇయర్బడ్స్లో టచ్ కంట్రోల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ అసిస్టెంట్, ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్, కాల్ కంట్రోల్స్ మొదలగు ఫీచర్స్ ఉన్నాయి.