ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి Noise కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్

by Disha Web Desk 17 |
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి Noise కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: నాయిస్ కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లోకి విడుదల అయింది. ఈ మోడల్ పేరు ‘నాయిస్ ఫిట్ క్రూ ప్రో(NoiseFit Crew Pro)’. దీని ధర రూ. 2,199. జూన్ 20 నుంచి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్, జెట్ బ్లాక్ అనే మూడు కలర్స్‌లలో లభిస్తుంది.

NoiseFit Crew Pro స్మార్ట్‌వాచ్ 240x240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.4-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వాచ్‌కు బయట రెండు బటన్‌లు ఉన్నాయి. వాచ్‌లో రన్నింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ సెన్సార్‌లను కూడా అందించారు. స్మార్ట్‌వాచ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జింగ్‌తో ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. వాచ్ నీరు, ధూళి నిరోధకత కోసం IP68-రేట్ చేయబడింది.

Next Story

Most Viewed