iPhone, Samsung వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక

by Disha Web Desk 17 |
iPhone, Samsung వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: iPhone, Samsung వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీచేసింది. పాత వెర్షన్ వాడుతున్న వారు వెంటనే కొత్త వెర్షన్‌కు మారాలని పేర్కొంది. పాత iOS వెర్షన్‌లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని, దీని ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగలించే అవకాశం ఉందని భారత ప్రభుత్వం iPhone వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ప్రకారం, iOS 16.3.1, అంతకంటే ముందు వెర్షన్‌లు iPhone 8, iPad Pro మోడల్‌లు, iPad Air 3rd-gen, iPad 5th-gen, iPad mini 5th-gen ఫోన్లు హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం ఉందని, తొందరగా iOS వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు కూడా తమ ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం హెచ్చరించింది.

Next Story

Most Viewed