ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ యూజర్లకు షాక్!

by Disha Web Desk 17 |
ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ యూజర్లకు షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ సంస్థ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్ వెరిఫికేషన్‌‌ను తొలగిస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం తెలిపారు. నిర్ణీత మొత్తంలో అమౌంట్ చెల్లించిన వారు మాత్రమే ఈ వెరిఫికేషన్ లోగోను కలిగి ఉంటారు. మిగతా వారికి ఈ లోగో కనిపించదు. ఏప్రిల్ 1 తరువాత బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకున్న వారు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ మార్క్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇండియాలో ట్విట్టర్ బ్లూ వెబ్‌ వినియోగదారులకు నెలవారీ ఫీజు రూ. 650, అదే, మొబైల్ యూజర్లకు నెలవారీ ఫీజును రూ. 900 గా నిర్ణయించారు. బ్లూటిక్ వెరిఫికేషన్‌‌ను తీసుకోవడం ద్వారా యూజర్లు 4,000 అక్షరాల వరకు గల ట్వీట్‌లను పోస్ట్ చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే యాడ్స్ కూడా తక్కువగా కనిపిస్తాయి.



Next Story

Most Viewed