ముంబైలో వాలిన ‘లైగర్’ గ్యాంగ్..

by  |
ముంబైలో వాలిన ‘లైగర్’ గ్యాంగ్..
X

దిశ,సినిమా: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్ చేస్తుండగా.. కొత్త షెడ్యూల్ కోసం మూవీ టీమ్ ముంబైకి చేరుకుందని తెలుస్తోంది. ఇటీవల వరంగల్‌లో జరిగిన ‘రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న లైగర్ గ్యాంగ్.. ఈవెంట్ అయిపోగానే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో డైరెక్ట్‌గా ముంబైకి వచ్చేసినట్లు కోప్రొడ్యూసర్ చార్మి తెలిపింది. ఈ మేరకు ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాను పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్ సరసన యంగ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండగా.. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం.

https://twitter.com/Charmmeofficial/status/1451879972369420291?s=20



Next Story