ఆర్చరీ వరల్డ్ కప్‌లో ఇండియాకు మూడు స్వర్ణాలు

by  |
Archery
X

దిశ, స్పోర్ట్స్: ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత విలుకారులు తమ ప్రతిభతో పతకాలు కొల్లగొట్టారు. ఫ్రాన్స్ రాజధాని పారీస్‌లో జరిగిన మూడో దశ ప్రపంచ కప్ పోటీల్లో భారత స్టార్ ఆర్చర్స్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భారత స్టార్ జోడి అతాను దాస్, దీపిక కుమారి మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఆ తర్వాత దీపిక, అంకిత కలిసి డబుల్స్ విభాగాల్లో స్వర్ణం గెలిచి భారత పతకాలను పెంచారు. ఈ ఏడాది రెండు సార్లు జరిగిన ప్రపంచ కప్‌లో వీరిద్దరికీ ఇది వరుస విజయాలు కావడం విశేషం.ఏప్రిల్‌లో గ్వాటిమాలలో జరిగిన ప్రపంచ‌ కప్‌లో కూడా వీరిద్దరి అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ స్వర్ణ పతకం గెలిచాడు. ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత జట్టు మంత్తం మూడు స్వర్ణాలు గెలవడం విశేషం.



Next Story

Most Viewed