భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం 

by  |
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం 
X

దిశ, వెబ్ డెస్క్ : మొతెరా స్టేడియంలో ఇంగ్లాండ్‌‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌ పెలివియన్‌కు క్యూ కట్టారు. రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లాండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్.. ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది.


Next Story