మరికాసేపట్లో న్యూజీలాండ్‌తో మ్యాచ్.. కన్ను కొట్టిన హార్దిక్ పాండ్యా(వీడియో)

by  |
మరికాసేపట్లో న్యూజీలాండ్‌తో మ్యాచ్.. కన్ను కొట్టిన హార్దిక్ పాండ్యా(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా కాసేపట్లో టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్‌ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్‌, 7.30కు మ్యాచ్‌ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియా జట్టు సన్నద్ధం అయింది. హోటల్‌ నుంచి మైదానానికి బయల్దేరింది. తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ హోటల్ బయటకొచ్చి బస్కెక్కారు. వారి వెనకాలే వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కేఎల్ రాహుల్, రవిచంద్ర అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రిషబ్ పంత్, శార్దుల్ ఠాకూర్, రోహిత్ శర్మ, ఎంస్ ధోని తదితరులు బస్సు ఎక్కారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా కెమెరా వైపు చూస్తూ కన్ను కొట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తూ.. We Are Ready అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరికొందరు అయితే ఈ మ్యాచ్‌ కూడా పోయింది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.


Next Story

Most Viewed