కొలంబోలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ధావన్ సేన

by  |
కొలంబోలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ధావన్ సేన
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వెళ్లిన టీమ్ ఇండియా కొలంబోలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. క్వారంటైన్ ముగియడంతో శుక్రవారం నుంచి మైదానంలో దిగిన ధావన్ సేన రన్నింగ్, జంపింగ్ వ్యాయామాలు ప్రారంభించింది. చాహల్, చాహర్, కృష్ణప్ప గౌతమ్, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, కృనాల్ పాండ్యా పరుగు పందెంలో పోటీ పడ్డారు. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో చాలా సుదీర్ఘంగా ముచ్చటించారు.

శనివారం నుంచి పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ ప్రారంభమవుతుందని.. వచ్చే వారంలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయని బీసీసీఐ చెప్పింది. కాగా, 2018లో నిదహాస్ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కరోనా కారణంగా ఖాళీ స్టేడియంలలో నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed