ఏం చేయలేకపోయాం.. బాధగా ఉంది : కోహ్లీ

by  |
ఏం చేయలేకపోయాం.. బాధగా ఉంది : కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓటమి చెందింది. టీమిండియా టెస్టు చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు మాత్రమే చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నాకు మాటలు రావడం లేదు. మైదానంలో అడుగుపెట్టేసరికి 60 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. కానీ వెనువెంటనే అంతా ముగిసిపోయింది. రెండు రోజుల పాటు బాగానే ఆడాం. కానీ చివరి సమయంలో ఏం చేయలేకపోయాం. ఇది నిజంగా నన్ను బాధించింది. పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌ చేయలేకపోయాం. కానీ అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిర్లక్ష్య ఆటతీరు, ప్రత్యర్థి జట్టు బౌలర్లు బంతులు సంధించిన విధానం రెండూ కూడా ఓటమికి కారణమయ్యాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed