నమస్తే తెలంగాణ పేపర్ తగులబెట్టిన పంతుళ్లు

by  |
నమస్తే తెలంగాణ పేపర్ తగులబెట్టిన పంతుళ్లు
X

దిశ‌, వరంగ‌ల్ తూర్పు: ఉపాధ్యాయుల మ‌నోభావాలు కించ‌ప‌రిచేలా ‘సొమ్ము అంద‌రిదీ.. సోకు కొంద‌రిదా’ పేరిట న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక‌లో ఇటీవల వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఆ వార్త‌ను ఖండిస్తూ సోమ‌వారం వరంగల్ జిల్లా కేంద్రం పోచ‌మ్మ మైదాన్ సెంట‌ర్‌లో జీటీఏ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ ప‌త్రిక ప్ర‌తుల‌ను ద‌హ‌నం చేశారు. ప‌త్రిక‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దిన‌ప‌త్రిక యాజ‌మాన్యం బేష‌ర‌తుగా ఉపాధ్యాయుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Next Story