మహిళను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్…

by  |
మహిళను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్…
X

మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Next Story

Most Viewed