భద్రాద్రిలో ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్..

by  |
భద్రాద్రిలో ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్..
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడుకి శనివారం కరోనా సోకింది. విషయం తెలియగానే మండల విద్యాశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ, కరోనా పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత అకినేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలను మొత్తం శానిటేషన్ చేశారు.

Next Story

Most Viewed