ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేత

by  |
ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేత
X

దిశ, మహబూబ్‎నగర్: మహబూబ్‎నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే భూ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీడీఆర్ బాండ్లను అందచేశారు. గురువారం మహబూబ్‎నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని.. కానీ, వారిని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఛైర్మన్ కోరమోని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

tag: Minister Srinivas Goud, TDR bonds, Land owners, Mahabubnagar

Next Story

Most Viewed