‘ చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టడానికి సిగ్గులేదా ’

by  |
‘ చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టడానికి సిగ్గులేదా ’
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి భూముల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు అందజేశారన్న విషయం తెలిసిందే. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ మండిపడింది. మాజీ సీఎంకు సీఐడీ నోటిసులు పంపడం ఇదే మొదటి సారి కావచ్చు . చంద్రబాబు మీద ఏకేసు పెట్టాలో తెలియక ఎస్సీ, ఎస్టీకేసు పెట్టే స్థాయికి దిగజారావా జగన్ రెడ్డి అంటూ సీఎం జగన్ ను ప్రశ్నంచింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసు పెట్టడానికి సిగ్గులేదా అంటూ హెచ్చరించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని. అందుకోసమే చంద్రబాబు పై ఏనేరం లేకున్నా ఇలా ఇరికించారన్నారు.



Next Story

Most Viewed