ప్రాణాలకు సీఎం వెల కట్టడం ఏంటీ?

by  |
ప్రాణాలకు సీఎం వెల కట్టడం ఏంటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ చట్టం ప్రేమోన్మాదులకు చుట్టంగా మారిందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హత్యకు గురైన వారి ప్రాణాలకు సీఎం వెల కడుతున్నారని మండిపడ్దారు. పోలీసుల అలసత్వం వల్లే రాష్ట్రంలో నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. కాగా సోమవారం వరలక్ష్మిని హత్య చేసిన నిందితుడు అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో విశాఖ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీపీని కలిసేందుకు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అనిత మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసులపై విరుచుకుపడ్డారు.

Next Story

Most Viewed