స్థానిక ఎన్నికల్లో టీడీపీ నినాదం ఇదే..!

by  |

‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాటని అన్నారు. అప్పట్లో అమరావతికి మద్దతు తెలిపి మాట తప్పం, మడమ తిప్పం అన్నవారు నేడు ఏమైపోయారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైఎస్సార్సీపీ తెరపైకి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. సందిరెడ్డి శేఖర్ అనే దివ్యాంగుడికి పెన్షన్ తీసివేశారంటూ జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగ్స్ కొట్టిన జగన్‌కు దివ్యాంగుల పెన్షన్లు ఎత్తివేయడం సిగ్గనిపించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తొలగించిన 7 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలని, లేకుంటే మరో ఉద్యమం తప్పదని లోకేశ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed