వైసీపీ ఎమ్మెల్యేతో టీడీపీ కార్పొరేటర్ల భేటీ.. అధిష్ఠానం సీరియస్

by  |
tdp corporators
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లా గాజువాకలో టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయిన అంశం అధిష్ఠానం ఆగ్రహానికి కారణమైంది. శుక్రవారం గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని గాజువాక ప్రాంతానికి చెందిన ఏడుగురు కార్పొరేటర్లు కలిశారు. దీంతో టీడీపీ అధిష్టానం ఆగ్రహించి ఏడుగురు కార్పొరేటర్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ లెళ్ళ కోటేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, ఇతర కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధికి సహకరించాలని కోరడానికే ఎమ్మెల్యే నాగిరెడ్డిని కలిసినట్లు చెప్పుకొచ్చారు.

అంతేతప్ప ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నామని.. ఇకపై ఉంటామని కూడా తేల్చి చెప్పారు. చంద్రబాబు విజన్, అభివృద్ధి కారణంగా గాజువాకలో టీడీపీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని.. ఎవరో తమపై దుష్ప్రచారం చేశారని కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు.



Next Story

Most Viewed