విషాదం.. TDP సీనియర్ నేత పీఆర్ మోహన్ కన్నుమూత

by  |
PR-Mohan
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ సీనియర్ నేత, శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్ మోహన్ తుది శ్వాస విడిచారు. శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం గుండె పోటుతో మోహన్ మరణించారు. అయితే, 1983 నుంచి మోహన్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 1984లో పీఆర్‌ను శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ నియమించారు. 1994, 2014లో రెండు సార్లు శాప్‌ ఛైర్మన్‌గా పని చేశారు.

పీఆర్ మోహన్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మోహన్‌ సేవలు వెలకట్టలేనివి అని చంద్రబాబు అన్నారు. మోహన్‌ పార్టీ పట్ల అంకితభావంతో పని చేశారని లోకేశ్‌ అన్నారు. అతని మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. పీఆర్‌ మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story

Most Viewed