టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

by  |
 టీడీపీ సీనియర్ నేత కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజా రావు కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే చికిత్స నిమిత్తం అతనిని హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చింతలపూడి నుంచి రాజారావు పోటీ చేశారు. రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు.


Next Story

Most Viewed